కాలనీ సంఘాల సహకారంతో డివిజ‌న్‌ను మరింత‌ అభివృద్ధి చేస్తా: చందానగర్ ‌కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: చందాన‌గ‌ర్ డివిజ‌న్ ప‌రిధిలోని సిటిజన్ కాలనీ, వీకర్ సెక్షన్ కాలనీ, శివాజీ నగర్, హుడా ఫేజ్ 2 కాలనీలలో ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా స్థానిక‌ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. కాలనీల్లో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ‌ దృష్టికి తెచ్చిన రోడ్లు, డ్రైనేజీ తదితర సమస్యలను పరిష్కరించేలా చూస్తామని హామినిచ్చారు. డివిజన్‌ ను‌ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని అందుకు ఆయా కాలనీ సంఘాల సహకారం‌ ఉండాలని కోరారు. కాలనీలలో శానిటేషన్ సిబ్బందితో పారిశుద్య చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, అధికారులు ఏఈ రవిచంద్ర, వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, శ్రీనివాస్ టిఆర్ఎస్ నాయకులు లక్ష్మినారాయణ గౌడ్, జనార్ధన్ రెడ్డి, ఓ.వేంకటేష్ , ధనలక్ష్మి, దాసు, ఏస్.ఏన్ రెడ్డి , ప్రవీణ్ భవాని చౌదరి, నర్సింహ గౌడ్, రామస్వామి, శ్రీనివాస్ నాయక్, కరుణాకర్, ముజాహిద్,మెయిజ్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

పట్టణ ప్రగతిలో శానిటైజేషన్ చేయిస్తున్న చందానగర్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here