బ్రహ్మకుమారీస్ కల్పతరూహ్ కార్యక్రమం అభినందనీయం- శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తారానగర్ లో బ్రహ్మ కుమారీస్ వారి కల్పతరూహ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలన్నారు. 50 వ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్రహ్మ కుమారిస్ వారు 75 వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఉన్న 55 వేల బ్రహ్మ కుమారిస్ సెంటర్లలో ఒక్కొక్క సెంటర్ లో 75 మొక్కలు నాటి దేశవ్యాప్తంగా 40 వేల మొక్కలు నాటాలని సంకల్పించుకోవడం అభినందనీయమని అన్నారు. జున్ 5 వ తేదీ నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు 75 రోజుల్లో ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, పరిరక్షించాలని పిలుపునివ్వటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రామచందర్, వార్డు మెంబర్ కవిత, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, గోపాల్ యాదవ్, బి.కే జ్యోతి, బి.కే పద్మ, బి.కే సౌజన్య, బి.కే సాగర్, బి.కె మోహన్, తదితర బ్రహ్మకుమారిస్ సభ్యులు పాల్గొన్నారు.

తారానగర్ లో బ్రహ్మకుమారీస్ కల్పతరూహ్ ద్వారా మొక్కలు నాటిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here