వరద బాధితులకు అండగా నటుడు రాంకీ

– వరద బాధితులకు నిత్యావసర సరుకులు అందజేత
– ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 లక్షలు విరాళం

వరద బాధితులకు నిత్యవసర సరుకులను పంపిణీ చేస్తున్న ప్రముఖ నటుడు రాంకీ 

మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లికి చెందిన ప్రముఖ నటుడు, నిర్మాత, నంది అవార్డు గ్రహీత రాంకీ ఆపత్కాలంలో తన ఉదారతను చాటుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద నీరు ముంచెత్తిన జగద్గిరిగుట్ట ప్రాంతంలోని బాధితులకు నేనున్నానంటు బరోసా కల్పించాడు. వందకు పైగా వరద బాధిత కుటుంబాలకు తన సొంత నిధులతో నిత్యావసర సరుకులను అందజేశాడు. అంతటితో ఆగకుండా రూ.5 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటించారు. అందుకు సంబంధించిన చెక్కును మంత్రి కేటీఆర్ కు అందజేశారు. ప్రకృతి విపత్తుల సమయంలో రాంకీ లాంటి నటులు బాధితులకు ఆసరాగా నిలవడం అభినందనీయమని కేటీఆర్ కొనియాడారు.

మంత్రి కేటీఆర్ కు రూ.5 లక్షల విరాళం చెక్కును అందజేస్తున్న ప్రముఖ నటుడు రాంకీ
వరద బాధితుల కోసం నిత్యావసర సరుకులను ప్యాకింగ్ చేయిస్తున్న నటుడు రాంకీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here