గుర్తు తెలియ‌ని వ్య‌క్తి హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతూ మృతి

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 10 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. చందాన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకున్న ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. శేరిలింగంప‌ల్లిలోని లింగంప‌ల్లి రైల్వే స్టేష‌న్ ప్లాట్ ఫామ్ నం.6 స‌మీపంలో ఈ నెల 9వ తేదీన మ‌ధ్యాహ్నం 12 గంట‌ల స‌మ‌యంలో ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి అప‌స్మార‌క స్థితిలో ప‌డి ఉన్నాడ‌ని డ‌య‌ల్ 100 ద్వారా స‌మాచారం అందుకున్న చందాన‌గ‌ర్ పోలీసులు ఆ వ్య‌క్తిని చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. ఈ క్ర‌మంలో అత‌ను చికిత్స పొందుతూ సోమ‌వారం మృతి చెందాడు. అతని వివ‌రాలు తెలియ‌లేద‌ని, వ‌య‌స్సు బ‌హుశా 40 సంవ‌త్స‌రాల వ‌ర‌కు ఉంటుంద‌ని, బ‌హుశా లింగంప‌ల్లి రైల్వే స్టేష‌న్ స‌మీపంలో భిక్షాట‌న చేస్తుంటాడ‌ని, ఎవ‌రైనా గుర్తు ప‌ట్ట‌ద‌లిస్తే త‌మ‌ను సంప్ర‌దించాల‌ని పోలీసులు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here