తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయం – బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మొవ్వా సత్యనారాయణ

నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శేరిలింగంపల్లి నియోజకవర్గం లో బిజెపి నాయకులు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆయా డివిజన్లలోని ప్రధాన కూడళ్ల వద్ద బిజెపి జెండాను ఆవిష్కరించారు. మియాపూర్ బస్ స్టాప్ వద్ద, జనప్రియ నగర్ కాలనీలో బిజెపి రాష్ట్ర నాయకులు మొవ్వ సత్యవనారాయణ జెండాలను ఆవిష్కరించి పార్టీ నినాదాలతో కార్యకర్తల తో స్వీట్లు పంచుకొని ఆవిర్భావ సంబరాలను జరుపుకున్నారు .అనంతరం హఫీజ్ పెట్ డివిజన్ లో ఓల్డ్ హఫీజ్ పెట్, హఫీజ్ పెట్ ప్లై ఓవర్ వద్ద, సాయి నగర్ కాలనీ, ప్రజా సిటీ, గంగారాం విలేజ్, హుడా కేఫ్, ఆల్విన్ కాలనీ బిజెపి కార్యాలయం వద్ద పార్టీ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం ప్రధానమంత్రి మోడీ ప్రసంగాన్ని టీవీలలో వీక్షించారు. మోడీ నాయకత్వంలో, బండి సంజయ్ సారథ్యంలో బిజెపి రాబోయే రోజుల్లో అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమం లో మియాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ మాణిక్ రావు, జనరల్ సెక్రటరీలు లక్ష్మణ్, రామకృష్ణారెడ్డి, రంగారెడ్డి అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు ఆవిర్భావదినోత్సవ ఇంచార్జి డీఎస్ఆర్ కే ప్రసాద్, రాఘవేంద్రరావు, ప్రభాకర్, విజయేందర్, వంశీ, సాంబయ్య, హఫీజ్ పెట్ డివిజన్ ప్రెసిడెంట్ శ్రీధర్ రావు, పృథ్వీ గౌడ్, రవి గౌడ్, మహేష్ యాదవ్, జితేందర్, సజ్జ కోటేశ్వర్ రావు, నందు, రమణయ్య, మహేష్, శివ, బాబు రెడ్డి, వరప్రసాద్, జగన్ గౌడ్, వినయ, భ్రమరాంబిక తదితరులు పాల్గొన్నారు.

బిజెపి జెండాను ఆవిష్కరిస్తున్న మొవ్వా సత్యనారాయణ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here