శిల్పారామంలో సత్యకీర్తి నృత్యదామం నాట్య ప్రదర్శన

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో నేషనల్ హ్యాండ్లూమ్ ఎక్స్ ఫో సందర్బంగా సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా మంగళవారం సత్య కీర్తి నృత్య ధామం గురువు బాలాజీ శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు. మూషిక వాహన, ఝేమ్ ఝేమ్ త నన , బ్రహ్మాంజలి, భామాకలాపం, దశావతార శబ్దం, కొలువైతివా, శివాష్టకం, తారంగం, త్యాగరాజ కీర్తన, బ్రహ్మమొక్కటే, భోశంభో, గోవిందాసరిత, రామాయణ శబ్దం, తిల్లాన, కంజదళాయతాక్షి అంశాలపై చేసిన నృత్యప్రదర్శనలు ఆహుతులను ఎంతగానో‌ ఆకట్టుకున్నాయి. కళాకారులు నిహారిక, అంజలి, సాహితి, నిఖిల, వందన, లాస్య, రిషిత, వీక్షిత, ఆశ్రీత, సాయి ఆశ్రీత, యశస్వి, ఐశ్వర్య, సాత్విక, కార్తీక, లాస్య శ్రీ, సత్య లాస్య లు ప్రదర్శించి మెప్పించారు.

ఆకట్టుకున్న‌ కళాకారుల ‌నృత్యప్రదర్శన
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here