
గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పనిచేసే కోఆర్డినేటర్ లతో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించారు. 2017 సంవత్సరం కంటే ముందు డిగ్రీ పూర్తి చేసిన గ్రాడ్యుయేట్స్ అందరిని ఓటర్లుగా నమోదు చేయాలని పిలుపునిచ్చారు. ఓటరు నమోదు ప్రణాళిక అదేవిధంగా ఫామ్ 18 కు సంబంధించిన సూచనలు చేశారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటుహక్కును విధిగా ఉపయోగించుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు రామేశ్వరమ్మ, నాయకులు సతీష్ ముదిరాజ్, రమేష్ గౌడ్, వెంకటేష్ ముదిరాజ్, నారాయణ మరియు ఓటరు నమోదు సభ్యులు పాల్గొన్నారు.