ఎన్నికల వేళ అధికార పక్షం అభివృద్ధి డ్రామ: ఎల్లేష్

శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ గోపినగర్ లో కాంగ్రేస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు కర్చర్ల ఎల్లేష్ పర్యటించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను బస్తీవాసులు ఎల్లేష్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా డ్రైనేజీ, రోడ్ల సమస్య తీవ్రతను వివరించారు. ఈ సందర్భంగా ఎల్లేష్ మాట్లాడుతూ గత సంవత్సరం కాలంగా గోపినగర్, బాపునగర్, పాపిరెడ్డి కాలనీ తదితర ప్రాంతాల్లోని దుస్థితిని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా, వ్రాతపూర్వకంగా ఫిర్యాదులు చేసినా ప్రయోజనం లేదని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఇంతవరకు నిమ్మకు నీరెత్తినట్టు గా ప్రవర్తించి బల్దియ ఎన్నికలను ఉంచుకొని ప్రజలను మభ్య పెట్టాలని నామమాత్రంగ రోడ్లు మరమ్మత్తుల డ్రామాకు తెరలేపారన్నారు. ఆ పనులు సైతం నెలల తరబడి పెండుగులో పడటం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా స్పందించి మౌళిక వసతుల కల్పనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సుధాకర్ సాగర్, బాబు యాదవ్, అశోక్, రమేష్ గౌడ్, నాగిరెడ్డి, కృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
