పోలీస్ స్టేష‌న్‌లు ప‌చ్చ‌ద‌నంతో క‌ళ‌క‌ళ‌లాడాలి: డీసీపి వెంక‌టేశ్వ‌ర్లు

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: చందాన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో గురువారం సాయంత్రం హ‌రిత‌హారం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాదాపూర్ డీసీపీ వెంక‌టేశ్వ‌ర్లు, మియాపూర్ ఏసీపీ కృష్ణ ప్ర‌సాద్‌లు పోలీస్‌స్టేష‌న్ ప్రాంగ‌ణంలో మొక్క‌లు నాటారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ ప‌ర్య‌వర‌ణ ప‌రిర‌క్ష‌ణ ప్ర‌తి ఒక్క‌రి భాద్య‌త అని అన్నారు. పోలీస్ స్టేష‌న్‌లు పూర్తి ప‌చ్చ‌దనంతో క‌ళ‌క‌ళాల‌డాల‌ని పిలుపునిచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో ఇన్‌స్పెక్ట‌ర్ క్యాస్ట్రో, ఎస్ఐలు అహ్మ‌ద్ పాషా, రాములు, వెంక‌టేశ్‌, బాల‌రాజు, ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు.

చందాన‌గ‌ర్ పోల‌స్‌స్టేష‌న్‌లో మొక్క‌లు నాటుతున్న డీసీపీ వెంక‌టేశ్వ‌ర్లు, ఏసీపీ కృష్ణ ప్ర‌సాద్‌, ఇన్‌స్పెక్ట‌ర్ క్యాస్ట్రో
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here