మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు అండగా ఎల్లప్పుడూ బిజెపి నిలబడుతుందని బిజెవైఎం జాతీయ నాయకులు లంగటి నరేందర్రెడ్డి అన్నారు. చలో గుర్రంపాడు కార్యక్రమంలో అరెస్ట్ అయ్యి 35 రోజులు జైలులో ఉండి బెయిల్ మీద విడుదలైనా బీజేవైఎం మియాపూర్ డివిజన్ అధ్యక్షులు సిద్దుని బీజేవైఎం జాతీయ నాయకులు లంగటి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేవైఎం రాష్ట్ర నాయకులు నందనం విష్ణుదత్తో పాటు పార్టీ నాయకులు కలిసి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా చందానగర్ డివిజన్ కార్పొరేటర్ కంటెస్టెడ్ అభ్యర్థి కసిరెడ్డి సింధురఘునాథ్ రెడ్డి సహకారంతో సిద్దు కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకులు హరికృష్ణ, చంద్ర మోహన్, రాహుల్ జిల్లా నాయకులు జితేంద్ర, అమిత్ తదితరులు పాల్గొన్నారు.
