శేరిలింగంపల్లి, నవంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని నారాయణ కాలేజీ నుండి దీప్తిశ్రీ నగర్ కాలనీ వరకు నూతనంగా నిర్మాణం చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణం పనులను స్థానిక నాయకులతో కలిసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ పరిధిలోని నారాయణ కాలేజీ నుండి దీప్తిశ్రీ నగర్ కాలనీవరకు నూతనంగా నిర్మాణం చేపట్టిన సిసి రోడ్డు నిర్మాణ పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించడం జరిగిందని, మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని, సీసీరోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలన్నారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, మెరుగైన రవాణా సౌకర్యం కోసం శాయ శక్తులా కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు స్వచ్చమైన చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ప్రతాప్ రెడ్డి, సంతోష్, మల్లేష్, నారాయణ, జిహెచ్ఎంసి ఏఈ సంతోష్, వర్క్ ఇన్స్పెక్టర్ అన్వర్ తదితరులు పాల్గొన్నారు.






