శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో డెవలప్మెంట్ అఫ్ కమీషనర్, మినిస్ట్రీ అఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వీవెర్స్ సర్వీస్ సెంటర్ హైదరాబాద్ ఆధ్వర్యం లో హత్కర్గా మేళా ( స్టేట్ హ్యాండ్లూమ్ ఎక్స్పో) మై హ్యాండ్లూమ్ మై ప్రైడ్ మేళాను అగ్రికల్చర్ మార్కెటింగ్, కోఆపరేషన్, హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు హాజరై ప్రారంభించారు. 19 రాష్ట్రాలకి చెందిన చేనేత హస్తకళా ఉత్పత్తులను ఇందులో భాగంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా మంత్రి చేనేత కళాకారులతో మాట్లాడారు. ప్రభుత్వం ఎల్లపుడూ చేనేత కళాకారులకి అండగా ఉంటుందని తెలిపారు. వీవెర్స్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ అరుణ్ కుమార్ పాల్గొన్నారు.






