జాయ్ అలుకాస్ సంస్థ సేవ‌లు అభినంద‌నీయం : కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో JOY-ALUKKAS సంస్థ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. JOY-ALUKKAS వారు ZPHS పాఠశాలకు రూ.2,52,500 నిధులతో కంప్యూటర్లు, ఫర్నిచర్ తదితర సదుపాయాలను సమాకూర్చారారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాఠశాల ప్రధానోపాధ్యాయుని ఉపాధ్యాయుల‌ సమక్షంలో JOY-ALUKKAS చందానగర్ బ్రాంచ్ మేనేజర్ రతీష్, అకౌంట్ మేనేజర్ ప్రశాంత్ లను శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.

ఆర్థిక స‌హాయాన్ని స్వీక‌రిస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

కార్పొరేటర్ మాట్లాడుతూ పేద విద్యార్థుల‌ చదువుకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో విద్యార్థులను ప్రోత్సహిస్తూ JOY-ALUKKAS వారు మంచి ఆలోచనతో ముందు రావడం చాలా సంతోషకరమైన విషయమని వారిని అభినందించారు. విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ZPHS HM రత్నప్రభ, ఉపాధ్యాయులు భాస్కర్ యాదవ్, బల్వంత్ రెడ్డి, వీరేశం, లక్ష్మి, ఉదయ కుమారి, కరుణ, ధనలక్ష్మి, రవీందర్, శ్రీనివాస్, సందయ్య నగర్ ప్రెసిడెంట్ బస్వరాజ్, నెహ్రూనగర్ బస్తీ ప్రెసిడెంట్ గఫర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here