మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ హమీద్ పటేల్

నమస్తే శేరిలింగంపల్లి: పేదల‌ కోసం ఏర్పాటు చేసిన మెగా ఆరోగ్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ ఏ బ్లాకులోని బస్తీ దవాఖానలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఆధ్వర్యంలో టిమ్స్ హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు మెగా హెల్త్ క్యాంపును కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టిమ్స్ హాస్పిటల్ సహకారంతో, ఎమ్మెల్యే గాంధీ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం సంతోషకరమని అన్నారు. టిమ్స్ హాస్పిటల్ లో అనుభవం గల డాక్టర్స్ తో పేదలకు మంచి వైద్య సేవలు అందించటం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో టిమ్స్ డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. సృజన, శేరిలింగంపల్లి మెడికల్ ఆఫీసర్ డా. రామ్ సుబ్బారెడ్డి, మెడికల్ ఆఫీసర్ డా. నితిన్, హాస్పిటల్ స్టాఫ్ స్వామి, పండరి రెడ్డి, సంధ్య, కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు అబ్బుల కృష్ణగౌడ్, జనరల్ సెక్రటరీ పేరుక రమేష్ పటేల్, సెక్రటరీ జె. బలరాం యాదవ్, తెరాస సీనియర్ నాయకులు ఊట్ల కృష్ణ, శ్రీనివాస్ చౌదరి, రూప రెడ్డి, జంగంగౌడ్, రవి శంకర్ నాయక్, డా. రమేష్, శారదా, మంగమ్మ, లావణ్య, శ్యామల, సాయి శామ్యూల్ కుమార్, అబేద్ అలీ, సయ్యద్ ఉస్మాన్, కలీం, హిమామ్, కాశెట్టి అంజి, సంతోష్, సంజీవ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here