శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): ఎన్ఐటీ కాలికట్ యూనివర్శిటీ బోర్డ్ గవర్నర్స్ చైర్మన్ గా గజ్జల యోగానంద్ ని నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి కోవింద్ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సనత్ నగర్ లో జరిగిన కార్యక్రమంలో యోగానంద్ను సన్మానించారు.
ఈ సందర్భంగా యోగానంద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన విద్యా విధానం ప్రకారం విద్యా ప్రమాణాలలో తగిన మార్పులను తీసుకువచ్చేందుకు తప్పక ప్రయత్నిస్తానని తెలిపారు. ప్రజాసేవలో ఎప్పుడూ ముందుంటానని తెలియజేశారు. అలాగే తనపై నమ్మకం ఉంచి ఇంతటి ప్రతిష్టాత్మకమైన బాధ్యతలు అప్పగించిన రాష్ట్రపతికి, ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.