శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని దూబే కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి డివిజన్ తెరాస అధ్యక్షుడు మారబోయిన రాజుయాదవ్, దూబే కాలనీ అధ్యక్షుడు అనిల్ ముదిరాజ్ లు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస ప్రధాన కార్యదర్శి చింతకింది రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పందించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ వెంటనే డీఈ శ్రీనివాస్కు ఫోన్ చేశారు. మొదటి ప్రాధాన్యత కింద దూబే కాలనీలో వెంటనే రోడ్డు పనులు చేపట్టేలా చూడాలని అన్నారు.