చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ PJR ఎన్క్లేవ్, ఇక్రిశాట్ కాలనీలలో తలెత్తిన డ్రైనేజీ సమస్యను ఈఈ చిన్నారెడ్డి, ఏఈ అనురాగ్ తో కలిసి కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ PJR ఎన్క్లేవ్ రోడ్ నుండి ఇక్రిశాట్ కాలనీ ద్వారా STP లైన్ లోకి కలిసే డ్రైన్ పూర్తిగా నిండి పోయి మురుగు నీరు పోకుండా కాలనీ వాసులకు ఇబ్బందిగా మారిందని అన్నారు. అందువల్ల సమస్యను యుద్దప్రాతిప్రదికన పరిష్కరించి వాహనదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆమె అధికారులను కోరారు.