నమస్తే శేరిలింగంపల్లి: నూతనంగా వయో వృద్ధుల మరియు పౌరుల సంక్షేమ సంస్థ ఆవిర్భవించింది. సంస్థ అధ్యక్షుడిగా నల్ల సంజీవరెడ్డి నియమితులయ్యారు. ఉపాధ్యక్షునిగా నల్లాగు వెంకట సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శిగా దారా లక్ష్మయ్య, సంయుక్త కార్యదర్శిగా బచ్చు రాజు, కోశాధికారిగా యన్.నాగభూషణం, కార్యవర్గ సభ్యులుగా ఎస్.కిష్టన్న, ఎం.అశోక్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు నల్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ వయో వృద్ధులను సంరక్షణ, పౌరుల సంక్షేమం, హక్కుల సంరక్షణ కోసం వయో వృద్ధుల మరియు పౌరుల సంక్షేమ సంస్థను స్థాపించినట్లు తెలిపారు. ఆ దిశగా తమ సంస్థ సేవలు ముందుకు సాగుతాయని అన్నారు.