నమస్తే శేరిలింగంపల్లి: ప్రజలందరూ తప్పకుండా కోవిడ్ వాక్సినేషన్ తీసుకోవాలని, కరోనా వ్యాధిని అరికట్టేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ సూచించారు. గురువారం మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ లో ఏర్పాటు చేసిన ఉచిత వాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, సామాజిక భౌతిక దూరం పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య నగర్ టిఆర్ఎస్ బస్తీ అధ్యక్షుడు ఖాసిం, వార్డు సభ్యులు రహీమ్, మైనారిటీ నాయకులు బాబు మియా, సలీం, యూత్ నాయకులు ఖాజా, అర్షద్, హఫీజ్ పేట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ వినయ్ తదితరులు పాల్గొన్నారు.