నెహ్రూనగర్ లో మొహర్రం వేడుకలను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: కులమతాలకు అతీతంగా, హిందూ ముస్లింల మతసామరస్యానికి ప్రతీకగా నిలిచేది మొహర్రం పండగ అని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. డివిజన్ పరిధిలోని నెహ్రూనగర్ కాలనీలో పీర్ల మసీదు (అషుర్ ఖాన) వద్ద మోహర్రం వేడుకను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యువజన నాయకులు రాగం అనిరుద్ యాదవ్, పార్టీ డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, నాయకులు యాదాగౌడ్, గోపినగర్ బస్తీ కమిటీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, రషీదు మియా, గెహౌస్, గఫ్ఫార్, అక్బర్, జహంగీర్, షేక్ అజీజ్, రఫీక్, ఖైరత్, షబ్బీర్, నసీర్, కాలనీలోని ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.

నెహ్రూ నగర్ లో మొహర్రం వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here