తిరంగ యూత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

చందానగర్ గాంధీ విగ్రహం వద్ద భగత్ సింగ్ చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న రఘునాథ్ రెడ్డి, సతీష్ గౌడ్, మిరియాల ప్రీతం, రోషన్, పల్లె మురళి

– భగత్ సింగ్ చిత్రపటానికి వివిధ పార్టీల నాయకుల ఘన నివాళి

చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకొని తిరంగ యూత్ అసోసియేషన్ ఆద్వర్యంలో సోమవారం భారీ కార్ ర్యాలీ నిర్వహించారు. యూత్ అధ్యక్షుడు రోషన్, ఉపాధ్యక్షుడు పల్లె మురళీ టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రెడ్డి రఘునాథ్ రెడ్డి బిజెపి నాయకులు సతీష్ గౌడ్, టిఆర్ఎస్ నాయకులు మిరియాల ప్రీతంలు భగత్ సింగ్ చిత్రపటానికి నివాళులర్పించి ర్యాలీని ప్రారంభించారు.

చందానగర్ పురవీధుల్లో కొనసాగుతున్న తిరంగా యూత్ ర్యాలీ

ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ భగత్ సింగ్ ఇలాంటి విప్లవవీరుల పోరాట ప్రతిమ కారణంగానే ఈరోజు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది ఉన్నామని అన్నారు. యువత భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ర్యాలీ మియాపూర్ వరకు కొనసాగింది. ర్యాలీ ముగింపు కార్యక్రమంలో ఎం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి తాండ్ర కుమార్, టిఆర్ఎస్ హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, మియాపూర్ నాయకులు మోహన్ ముదిరాజుల్ పాల్గొని భగత్ సింగ్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జనార్దన్ గౌడ్, కొత్తపల్లి స్వామి తదితరులు పాల్గొన్నారు.

ర్యాలీలో పాల్గొన్న తిరంగ యూత్ సభ్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here