భ‌గ‌త్ సింగ్ ఆశ‌యాల‌ను ముందుకు తీసుకెళ్లాలి: ఎంసీపీఐయూ

మియాపూర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): భగత్ సింగ్ జయంతి సందర్భంగా మియాపూర్ లోని ఎంసీపీయూ గ్రేటర్ కార్యాలయంలో AIFDS, AIFDY గ్రేటర్ కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ చిత్ర‌ప‌టానికి నాయ‌కులు పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వనం సుధాకర్ హాజ‌రై భ‌గ‌త్ సింగ్‌ చిత్రపటానికి పూల మాలలు చేసి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థి సంఘం నాయకుడు పల్లె మురళి నివాళులర్పించారు. ఈ సందర్భంగా AIFDY రాష్ట్ర కార్యదర్శి వనం సుధాకర్ మాట్లాడుతూ భగత్ సింగ్ త్యాగం మరువలేనిదని అన్నారు. ఎంతో మందికి ఆయ‌న ఆద‌ర్శంగా నిలుస్తార‌ని అన్నారు. కులం, మ‌తం లేని స‌మాజాన్ని నిర్మించ‌డం కోసం ఆయ‌న ఎంత‌గానో క‌ల‌లు క‌న్నాడ‌ని అన్నారు. భ‌గత్ సింగ్ ఆశ‌యాల‌ను యువ‌త ముందుకు తీసుకువెళ్లాల‌ని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ కమిటీ కార్యదర్శి మధు, విద్యార్థి సంఘం నాయకుడు మదన్ శెట్టి, వివేక్, బస్తీవాసులు పాల్గొన్నారు.

భ‌గ‌త్ సింగ్ చిత్ర‌ప‌టం వ‌ద్ద నినాదాలు చేస్తున్న నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here