శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమాని ఎండీ జహీరుద్దీన్ తన స్నేహితులతో కలిసి సోమవారం ఎంపీ రంజిత్ రెడ్డిని కలిసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ ముఖ చిత్రం కలిగిన 300 మాస్కులను ఆవిష్కరించి ఎంపీకి అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో యువత సేవా కార్యక్రమాలను చేసేందుకు ముందుకు రావాలని, ఏ మాత్రం సమయాన్ని వృథా చేయకూడదని అన్నారు. యువత కష్టపడి పనిచేయాలని, కుటుంబ సభ్యులకు అండగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కరకటం రాము, రవి, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎంపీకి వారు మొక్కను బహుకరించారు.