శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ నూతన ఇన్చార్జిగా నియామకమైన మాణికమ్ టాగూర్ని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పార్టీ శేరిలింగంపల్లి ఇన్చార్జి రవికుమార్ యాదవ్లు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. టాగూర్ని గాంధీ భవన్లో కలిసిన వారు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర్ రెడ్డి, రవికుమార్ యాదవ్లు మాట్లాడుతూ.. తెలంగాణపై టాగూర్ తనదైన ప్రభావం చూపిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆయనతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.