వడ్డెర బస్తీ‌లో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప‌ర్య‌ట‌న

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): టీఆర్ఎస్ ప్రభుత్వం‌ హయాంలో మంత్రి కేటీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే ఆరెకపూడి‌ గాంధీల‌ సహకారంతో మసీదుబండ వడ్డెర బస్తీ‌ కాలనీలోని సమస్యలను పరిష్కరించి కాలనీ‌‌లో మౌలిక వసతులను కల్పించడం జరిగిందని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. ఆదివారం మసీదుబండ వడ్డెర బస్తీ కాలనీ వాసులతో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రత్యేక సమావేశమయ్యారు.

వ‌డ్డెర బ‌స్తీలో ప‌ర్య‌టిస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల కోసం తీసుకువస్తున్న ధరణి ఫోర్టల్ లో భాగంగా మంత్రి కేటీఆర్ ఇళ్లు నిర్మించుకున్న పేదలకు‌ న్యాయం చేయాలని సదుద్దేశంతో ఉన్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్పొరేటర్ గా గెలిచినప్పటి నుంచి వడ్డెర బస్తీలో అన్ని మౌలిక వసతులను‌ కల్పించామన్నారు. ఇంటింటికి మంచినీటి కనెక్షన్లు, యూజీడీ లైన్లు, సీసీ రోడ్లు, వీధి దీపాలు ఏర్పాటు చేయించడం పట్ల కాలనీ వాసులు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వడ్డెర బస్తీలోని ఇళ్లకు అధికార ద్రువీకరణ పత్రాలను ఇప్పించాలని కోరుతూ మహేష్ తో కలిసి కాలనీవాసులు, యువకులు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కు వినతి పత్రం అందజేశారు.

కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కు విన‌తి ప‌త్రం అంద‌జేస్తున్న స్థానికులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here