ఎంపీ రంజిత్ రెడ్డి జ‌న్మ‌దిన పాటల సీడీ ఆవిష్క‌ర‌ణ

శేరిలింగంపల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ రంజిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం, జీఆర్ఆర్‌ సేవా సమితి ఆధ్వర్యంలో రాయించిన పాటల సీడీని ఆదివారం ఎంపీ రంజిత్‌రెడ్డి ఆవిష్కరించారు. జ‌న్మ‌దినం నాడు ఎంపీ రంజిత్‌రెడ్డి డిల్లీలో ఉన్న నేప‌థ్యంలో సీడీని ఆల‌స్యంగా ఆవిష్క‌రిస్తున్న‌ట్టు తెలంగాణ ప్రైవేట్‌ ఉద్యోగ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు గంధం రాములు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డికి సంఘం స‌భ్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీయూఎస్‌ నాయకులు కోల శ్రీనివాస్, పురుషోత్తం, గంగాధర్ రావు, వేముల భాస్కర్, పీవై రమేష్, రవీందర్, మోహన్ నాయక్, కంది జ్ఞానేశ్వర్, నారాయణ పవర్, రంజిత్ అన్న యువ సేన అధ్యక్షుడు అశిల శివ కుమార్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

పాట సీడీని ఆవిష్క‌రిస్తున్న ఎంపీ రంజిత్ రెడ్డి

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here