గౌతమీనగర్ పార్కులకు ప్రహరీ నిర్మాణ పనులు ప్రారంభం

ఇరవయ్యేళ్ళ పోరాటానికి అనిర్వచనీయ విజయమిది: కసిరెడ్డి భాస్కరరెడ్డి

పార్కు ప్రహరీ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న కసిరెడ్డి భాస్కరరెడ్డి, కాలనీవాసులు

చందానగర్(నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని గౌతమీనగర్ కాలనీలోగల పార్కులకు ప్రహరీ నిర్మాణ పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. కాలనీలోగల రెండు పార్కులకు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి జిహెచ్ఎంసి అధికారులు టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించడం పై కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాలనీ అసోసియేషన్ ప్రధాన సలహాదారు, జనంకోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర రెడ్డి మాట్లాడుతూ పార్కు స్థలాలు ఆక్రమణలకు గురవ్వకుండా పరిరక్షించేందుకు స్థానిక ప్రజలతో కలిసి తాము గత ఇరవై సంవత్సరాల నుండి చేసిన పోరాటాలకు తగిన ఫలితం లభించిందన్నారు. సర్వేనెంబరు 30, 38, 39, 40, 41 లలో గల పార్కు స్థలాలు కబ్జాదారుల నుండి నేటితో విముక్తి పొందాయని తెలిపారు. తమ పోరాటంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకారం అందించిన ప్రతీఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

గౌతమీనగర్ పార్కులో ప్రహరీ నిర్మాణ పనులు చేపడుతున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here