నిరుపేద రోగికి మిరియాల రాఘవ ట్రస్టు చేయూత

మోహన్ నాయక్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేస్తున్న మిరియాల రాఘవ ట్రస్ట్ చైర్మన్ మిరియాల రాఘవరావు, డైరెక్టర్ మిరియాల ప్రీతం

చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): అనారోగ్యంతో బాధపడుతున్న ఓ నిరుపేద వ్యక్తికి మిరియాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ చేయూతను అందించింది. ఇందిరానగర్ లోనివాసం ఉండే మోహన్ నాయక్ లివర్ దెబ్బతిని శ్రీకర్ హాస్పిటల్ లో వైద్యం చేయించుకుంటున్నారు. విషయం తెలుసుకున్న మిరియాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మిరియాల రాఘవరావు డైరెక్టర్ మిరియాల ప్రీతంలు మోహన్ నాయక్ కుటుంబ సభ్యులకు రూ.15000/- ఆర్థికసాయం అందచేశారు. మోహన్ నాయక్ త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నట్టు మిరియాల రాఘవరావు, ప్రీతంలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here