సింహవాహనంపై గోదాదేవిపద్మావతి సమేతంగా స్వామి వారి ఊరేగింపు

నమస్తే శేరిలింగంపల్లి:చందానగర్ విశాఖ శ్రీ శారదాపీఠ పాలిత శ్రీ వేంకటేశ్వరాలయంలో 26వ షడ్వింశ బ్రహ్మోత్సవాలు మూడో రోజు శుక్రవారం భక్తుల మధ్య ఘనంగా సాగాయి. ఉదయం 7.30 గంటలకు అష్టోత్తర శతకలాభిషేకం, ఉదయం 10.30 గంటలకు సామూహిక లక్ష కుంకుమార్చన, మధ్యాహ్నం 12 గంటలకు హారతి తీర్థప్రసాదాల వితరణ జరిగింది. సాయంత్రం 6.30 గంటల నుంచి 8 గంటల వరకు ఐశ్వర్యలక్ష్మీ హోమం, మహాదాశీర్వచనం, సింహ వాహన సేవా తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి వారిని గోదా దేవి పద్మావతి సమేతంగా సింహ వాహనంపై భక్తి శ్రద్ధలతో ఊరేగింపు చేశారు. చందానగర్ చుట్టు పక్కల ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని భక్తిశ్రద్ధలతో కొలిచారు.

హోమంలో పాల్గొన్న భక్తులు
గోదాదేవి పద్మావతి సమేతంగా సింహవాహనంపై ఊరేగుతున్న శ్రీవారు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here