లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హోప్ అధ్యక్షుడిగా తోపుగుండ మహిపాల్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, జూలై 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హోప్ అధ్యక్షుడిగా తోపుగుండ మహిపాల్ రెడ్డి 2వ సారి బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు ఆయ‌న ప‌లు స‌మాజ‌హిత కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టారు. బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి రూ 50 వేల స‌హాయం అంద‌జేయ‌డంతోపాటు ⁠నల్లగండ్లకు చెందిన ఇద్దరు చిన్నారులకు చదువుకోసం రూ 20 వేలను అందించారు. ⁠వైద్య దినోత్సవాన్ని పుర‌స్క‌రించుకుని డాక్ట‌ర్ల‌కు స‌న్మానం చేశారు. అలాగే ⁠ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు రమణమూర్తి, కొండా విజయ్ కుమార్, శాంతిభూషణ్ రెడ్డి, గాలి కృష్ణ, సోమ నాగరాజు, రెడ్డి ప్రవీణ్ రెడ్డి, రాజశేఖర్, మధుసూదన్ రెడ్డి, మారం వెంకట్, కాశీనాథ్, భాస్కర్, మారం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here