శేరిలింగంపల్లి, అక్టోబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): నార్సింగ్ వైస్ చైర్మన్ జి వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ మహోత్సవ కార్యక్రమంలో రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచంద్ర యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఏటా ఘనంగా సదర్ నిర్వహిస్తున్న వెంకటేశ్ యాదవ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. యాదవుల గొప్ప పండుగ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్న ఈ పండుగ కుల మతాలకు అతీతంగా ఐక్యమత్యానికి చిహ్నంగా నిలుస్తుందన్నారు. అందరూ ఐక్యమత్యంతో ఉండి యాదవుల వృత్తిని కాపాడుతూ ఐకమత్యమే మహాబలంగా ప్రతి ఒక్కరూ సామాజిక న్యాయంతో మెలగాలని అన్నారు. అందరూ విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయాల్లో ముందు ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పెరుగు ఐలేష్ యాదవ్, అందెల కుమార్ యాదవ్, తెల్లాపూర్ శేఖర్, శంషాబాద్ మిద్దెల తేజస్వి తేజ యాదవ్, అరుణ్, కృష్ణ యాదవ్, రాము యాదవ్, యాదవ్ సంఘం నాయకులు, యువజన నాయకులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.






