శేరిలింగంపల్లి, జనవరి 26 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డిలో ఉన్న వార్డ్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ లోనీ రాష్ట్ర,జిల్లా, సీనియర్ నాయకులు,డివిజన్ నాయకులు,కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు,కాలనీ వాసులకు, స్థానిక నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.