ప్ర‌పంచ జ‌నాభ దినోత్స‌వ వేడుక‌ల్లో హ‌ఫీజ్‌పేట్ ఆరోగ్య కేంద్రం సిబ్బందికి అవార్డులు

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆద్వ‌ర్యంలో ప్ర‌పంచ జ‌నాభా దినోత్స‌వ వేడుక‌ల‌ను ఆదివారం ఘ‌నంగా నిర్వ‌హించారు. ఎల్‌బీన‌గ‌ర్‌లోని కామినేని హాస్పిట‌ల్స్‌లో జ‌రిగిన ఈ వేడుక‌ల్లో జిల్లా వైధ్యాధికారి డాక్ట‌ర్‌ స్వ‌రాజ్య‌ల‌క్ష్మి, ఉప వైద్యాధికారి డాక్ట‌ర్ సృజ‌న, డీఎంఓ డాక్ట‌ర్ సీఎచ్ రాకేష్‌లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జ‌నాభ నియంత్ర‌ణ‌లో భాగంగా విశిష్ట సేవ‌లు అందించిన వైద్య సిబ్బందికి అవార్డులు అంద‌జేశారు. కాగా హ‌ఫీజ్‌పేట్ ప‌ట్ట‌ణ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రం ల్యాబ్ టెక్నీషియ‌న్ ఇ.పండ‌రిరెడ్డి, అకౌంటెంట్ బి.సంతోష్‌కుమార్‌లు అవార్డులు ద‌క్కాయి. ఈ సంద‌ర్భంగా జిల్లా వైద్యాధికారులు వారికి జ్ఞ‌పిక, ప్ర‌శంసా ప‌త్రాల‌ను అంద‌జేశారు. అనంత‌రం వారు మాట్లాడుతూ రోజురోజుకు ప్ర‌పంచ జ‌నాభ పెరిగిపోతున్న‌ద‌ని, ముఖ్యంగా భార‌తదేశంలో ఆ సంఖ్య ఘ‌న‌నీయంగా పెరుగుతుంద‌ని అన్నారు. జ‌న‌భా నియంత్ర‌ణ‌కు ప్ర‌తి ఒక్క‌రు న‌డుం బిగించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్నారు. కుటుంబ నియంత్ర‌ణ ప‌ద్ద‌తుల‌పై ప్ర‌జ‌ల‌కు విస్తృత అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సిబ్బందికి సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో హ‌ఫీజ్‌పేట్ ప‌ట్ట‌ణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిక డాక్ట‌ర్ విన‌య్ బాబు, డాక్ట‌ర్ నాగ‌మ‌ణి, ఏపీఎంఓ ర‌మేష్‌ నాయ‌క్‌, స్టాఫ్ న‌ర్సులు క‌విత, స్నేహ‌ల‌త‌, రాజ్‌కుమార్‌, ఎల్‌టీఈ ప‌ద్మ త‌దిత‌రులు పాల్గొన్నారు.

హ‌ఫీజ్‌పేట్ ఆరోగ్య కేంద్రం ల్యాబ్ టెక్నీషియ‌న్ ఇ.పండ‌రిరెడ్డి, అకౌంటెంట్ బి.సంతోష్‌కుమార్‌ల‌కు జ్ఞాపిక‌, ప్ర‌శంసా ప‌త్రాల‌ను అంద‌జేస్తున్న జిల్లా వైద్యాధికారులు డాక్ట‌ర్ స్వారాజ్య‌ల‌క్ష్మి, డాక్ట‌ర్ సృజ‌న‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here