హఫీజ్పేట (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్పేట డివిజన్ పరిధిలోని ఇంజినీరింగ్ ఎన్క్లేవ్, ఆర్టీసీ కాలనీ, దత్తసాయి ఎన్క్లేవ్ కాలనీల్లో బుధవారం డివిజన్ తెరాస అభ్యర్థి పూజిత జగదీశ్వర్ గౌడ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డివిజన్ పరిధిలో గత 5 ఏళ్ల కాలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. ప్రజలు తనకు మరోసారి కార్పొరేటర్గా అవకాశం ఇవ్వాలని కోరారు. కార్పొరేటర్ గా మళ్లీ గెలిపిస్తే డివిజన్ను రెట్టింపు స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, బస్తీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.








