ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): అనారోగ్యంతో మృతి చెందిన ఓ వ్యక్తి అంత్యక్రియలకు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆర్థిక సహాయం అందజేశారు. వివరాల్లోకి వెళితే… ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ కాలనీకి చెందిన హనుమంతయ్య (80) అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గురువారం హనుమంతయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వారికి హనుమంతయ్య అంత్యక్రియల నిమిత్తం రూ.5వేల ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ కార్యక్రమంలో యువ నాయకుడు రామకృష్ణ గౌడ్, డివిజన్ తెరాస అధ్యక్షుడు జిల్లా గణేష్, వార్డు సభ్యుడు కాశీనాథ్ యాదవ్, మధులత తదితరులు పాల్గొన్నారు.