శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని చందానగర్ భవానీపురం కాలనీలో ఏర్పాటు చేసిన గణనాథుని లడ్డూ వేలం పాటను ఆదివారం నిర్వహించారు. ఇందులో భాగంగా గణేషుడి లడ్డూను రూ.1.16 లక్షలకు కాలనీవాసి మెండెలం రామ్మోహన్ రావు, పుష్ప లత దంపతులు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణనాథుడి లడ్డూను వేలంలో దక్కించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఆ వినాయకుడి కరుణా కటాక్షాలు తమపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు.






