విఘ్నేశ్వరుడి సేవలో మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శంకర్ నగర్ ఫేజ్-1లో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక శోభ నడుమ వైభవంగా జరిగాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్థానిక మహిళలు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి 108 రకాల వైవిధ్యభరితమైన ప్రసాదాలు, పిండివంటలను నైవేద్యంగా సమర్పించి, ప్రత్యేక మహామంగళహారతి నిర్వహించారు.

ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విఘ్నాలను తొలగించే గణపతి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. కాలనీల్లో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను సామూహికంగా నిర్వహించడం ఐక్యత, సౌభ్రాతృత్వానికి నిదర్శనమని మంజుల రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. వేడుకల్లో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో భక్తిపారవశ్యంతో పాల్గొన్నారు. స్వయంగా తమ చేతులతో నిష్ఠగా తయారు చేసిన వివిధ రకాల నైవేద్యాలను గణనాథుడికి సమర్పించి భక్తిని చాటుకున్నారు. ప్రత్యేక పూజలు, మహామంగళహారతితో శంకర్ నగర్ ఫేజ్-1లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here