గణేష్ లడ్డూకు భారీ డిమాండ్.. రూ.1.50 లక్షలకు దక్కించుకున్న నాగ‌ప్ర‌సాద్‌..

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మహాదేవ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ ఉత్సవాల్లో భాగంగా లడ్డూ వేలం పాటను ఘనంగా నిర్వహించారు. భక్తులు, స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ వేలం పాటలో గణేష్ లడ్డూకు విశేష ఆదరణ లభించింది. వేలం పాటలో స్క్వేర్ 9 కంపెనీ అధినేత సన్నితి నాగప్రసాద్ రూ.1.50 లక్షలకు గణేష్ లడ్డూను కైవసం చేసుకున్నారు. వేలం ప్రక్రియలో భక్తులు, నిర్వాహకులు ఉత్సాహంగా పాల్గొనడంతో కార్యక్రమం సందడిగా సాగింది. లడ్డూను వేలంలో దక్కించుకున్న సన్నితి నాగప్రసాద్‌ను మహాదేవ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ప్రతినిధులు, ఉత్సవ కమిటీ సభ్యులు అభినందించారు. గణనాథుడి ఆశీస్సులతో అందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు. గణేష్ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన లడ్డూ వేలం భక్తుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించింది. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరిస్తున్న భక్తులు, స్థానికులు, దాతలకు మహాదేవ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here