శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ఆదర్శనగర్ రోడ్ నంబర్ 3 వద్ద గత కొద్ది రోజులుగా డ్రైనేజీ నీరు రోడ్డుపైకి ప్రవహించడంతో స్థానికులు, పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్య మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ దృష్టికి రావడంతో ఆయన వెంటనే స్పందించారు. సమస్యను పరిష్కరించేందుకు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ డీజీఎం శ్రీహరికి ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాల మేరకు డీజీఎం శ్రీహరి సిబ్బందితో కలిసి వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.

డ్రైనేజీలో పేరుకుపోయిన వ్యర్థాలను సిబ్బంది తొలగించి, నీటి ప్రవాహానికి ఏర్పడిన అడ్డంకులను తొలగించారు. దీంతో రోడ్డుపైకి వస్తున్న డ్రైనేజీ నీటి సమస్యను పరిష్కరించారు. సమస్యపై వెంటనే స్పందించి పరిష్కరించిన రాగం నాగేందర్ యాదవ్కు, వాటర్ వర్క్స్ డీజీఎం శ్రీహరి, సిబ్బందికి స్థానిక వాసులు, కాలనీ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.





