ప్రపంచ అత్యవసర వైద్య దినోత్సవం.. మెడికవర్‌లో అత్యాధునిక ER-SSU యూనిట్ ప్రారంభం..

శేరిలింగంప‌ల్లి, మే 27 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రపంచ అత్యవసర వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకుని Medicover Hospitals హైటెక్ సిటీ యూనిట్‌లో అత్యాధునిక ER-SSU (ఎమర్జెన్సీ రూమ్ – షార్ట్ స్టే యూనిట్)ను ప్రారంభించింది. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు వేగవంతమైన, సురక్షితమైన, సమర్థవంతమైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో ఈ ప్రత్యేక యూనిట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ER-SSU యూనిట్‌ను ప్రముఖ టులు Dr. Rajasekhar, Jeevitha ప్రారంభించారు. కార్యక్రమంలో డా. సింధూర రెడ్డి – హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్, డా. దామోదర్ – ట్రామా సర్జన్, డా. హరి కృష్ణ – ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌తో పాటు సీనియర్ వైద్యులు, అత్యవసర వైద్య నిపుణులు, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ టీమ్ పాల్గొన్నారు. హైదరాబాద్‌లో ఎమర్జెన్సీ మెడిసిన్ నిపుణుల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తొలి షార్ట్ స్టే యూనిట్లలో ఇది ఒకటిగా నిలిచింది. ఐసీయూ చికిత్స అవసరం లేకపోయినా కొంతకాలం వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సిన రోగుల కోసం ఈ యూనిట్‌ను ప్రత్యేకంగా రూపొందించారు.

ఛాతినొప్పి, ఫిట్స్, శ్వాసలో ఇబ్బంది, తల తిరగడం, అకస్మాత్తుగా బలహీనత, నర సంబంధిత తాత్కాలిక సమస్యలతో వచ్చే రోగులకు ఇక్కడ నిరంతర పరిశీలన, వేగవంతమైన పరీక్షలు, తక్షణ చికిత్స అందించనున్నారు. ఈ సందర్భంగా డా. రాజశేఖర్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన వైద్య స్పందన ఎంతో కీలకం. ER-SSU వంటి ప్రత్యేక యూనిట్లు రోగులకు మరింత భరోసా, భద్రత కల్పిస్తాయి. మెడికవర్ హాస్పిటల్స్ ఈ తరహా ఆధునిక అత్యవసర వైద్య సేవలను అందించడం అభినందనీయం అని తెలిపారు. డా. సింధూర రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం అత్యవసర కేసుల స్వభావం వేగంగా మారుతోంది. ER-SSU ద్వారా రోగులకు నిరంతర పర్యవేక్షణ, వేగవంతమైన నిర్ధారణ, సమయానుకూల చికిత్స అందించగలుగుతున్నాం. ఇది అత్యవసర వైద్య సేవల్లో కీలక ముందడుగు అని పేర్కొన్నారు. డా. దామోదర్ మాట్లాడుతూ అత్యవసర వైద్యంలో ప్రతి నిమిషం ఎంతో విలువైనది. ER-SSU ద్వారా దీర్ఘకాలిక అడ్మిషన్ అవసరం లేకుండానే రోగులకు సురక్షితమైన, సమర్థవంతమైన వైద్యం అందించవచ్చు అని తెలిపారు.

డా. హరి కృష్ణ మాట్లాడుతూ రోగి భద్రత, నాణ్యమైన వైద్య సేవలే మా ప్రధాన లక్ష్యం. ER-SSU ప్రారంభం ద్వారా హైదరాబాద్‌లో అత్యవసర వైద్య సేవలను మరింత బలోపేతం చేస్తున్నాం అని అన్నారు. ER-SSU ప్రారంభంతో అత్యవసర వైద్య సేవల్లో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతూ, రోగి-కేంద్రిత వైద్య సేవల దిశగా మరో ముందడుగు వేసినట్లు ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here