శేరిలింగంపల్లి, నవంబర్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ భవన్లో దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి, జయశంకర్ చిత్ర పటానికి ఈ సందర్భంగా ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దీక్షా దివస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ అమర వీరుల స్థూపానికి కేటీఆర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.






