శేరిలింగంపల్లి, మార్చి 28 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్పేట డివిజన్ పరిధిలో ఉన్న ప్రజాసిటీ వెల్ఫేర్ అసోసియేషన్ లో బాలింగ్ సత్తయ్య గౌడ్ మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ కాలనీ వాసులతో కలిసి బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాసిటీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు నాయుడు, కేబుల్ రవి, వెంకటేష్ గౌడ్ ,శ్రీనివాస్ గౌడ్, మల్లేష్ పాల్గొన్నారు.