శేరిలింగంపల్లి, ఆగస్టు 13 (నమస్తే శేరిలింగంపల్లి): స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మియాపూర్ పోలీస్ స్టేషన్ను ఇంటెల్లిటాట్స్ స్కూల్ విద్యార్థులు సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని పోలీస్ అధికారులు, సిబ్బంది విధులను విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు పాటించే నియమాలను, నేర పరిశోధన, ఆయుధాలు వంటి వివరాలపై పోలీసు సిబ్బంది విద్యార్థులకు అవగాహన కల్పించారు.






