తాజ్ నగర్ మజీదులో ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేసిన గచ్చిబౌలి కార్పోరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఎన్ టి ఆర్ నగర్ తాజ్ నగర్ మజీద్ దగ్గర ముస్లిం మైనారిటీలకు తెలంగాణ ప్రభుత్వం తరపున రంజాన్ తోఫాను స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పవిత్ర మాసంలో ముస్లిం సోదర సోదరీమణులు అందరు బాగుండాలని ఉపవాస దీక్షలు చేస్తారని గుర్తు చేశారు. ఈ కరోనా సమయంలో ప్రతి ఒక్కరు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, తరచూ చేతులను సానిటైజ్ చేసుకోవాలని, ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు హనుమంత్ నాయక్, బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్యం, విట్టల్, నగేష్, వేణు రెడ్డి, మసీదు అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ సలీం, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్ షకీల్ తదితరులు పాల్గొన్నారు.

ముస్లింలకు రంజాన్ తోఫా అందజేస్తున్న గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here